బ్రేకింగ్: సిఎం జగన్ వరుస సమీక్షలు

-

ముఖ్యమంత్రి నేతృత్వం లో క్యాంప్ కార్యాలయంలో కోవిడ్ 19 పై సమీక్ష జరుగుతుంది. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో ఏపీలో కరోనా పరిక్షలు, మరిన్ని కరోనా ఆస్పత్రుల ఏర్పాటు, మరిన్ని కరోనా కట్టడి చేయడం గురించి ఆయన చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు, మరణాలపై అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటారు.

Cm Jagan
Cm Jagan

అలాగే వైద్యుల సమస్యల గురించి కూడా సిఎం జగన్ అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కేంద్రం సహకారంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక 12 గంటలకు ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ పై సీఎం సమీక్ష చేస్తారు. 3 గంటలకు బీసీ కార్పొరేషన్ చైర్పర్సన్, డైరెక్టర్ ల నియామకం పై చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి కొందరు మంత్రులు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news