రీ-వెరిఫికేషన్ లేకుండా పింఛన్లు తీసివేయం – సీఎం జగన్

-

రీ వెరిఫికేషన్ లేకుండా పింఛన్లు తీసివేయబోమని పేర్కొన్నారు సీఎం జగన్. వివిధ కారణాలతో పథకాలు మిగిలిపోయిన అర్హులకు జగన్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2,79,065 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.590.91 కోట్లు జమ చేశారు సిఎం జగన్.

తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిధుల విడుదల చేశారు సిఎం జగన్. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ, పింఛన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అనర్హులకు రాకూడదు, ఇవ్వకూడదు.. నోటీసులు ఇస్తారన్నారు.

రీసర్వే చేసి చర్యలు తీసుకుంటారు.. నోటీసులు ఇస్తేనే పింఛన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. రీ వెరిఫికేషన్ లేకుండా చర్యలు తీసుకోరని క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. లంచాలు లేకుండా అర్హులకు పథకాలు అందిస్తున్నాం.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయని అగ్రహించారు సిఎం జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news