పిల్లల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. జగనన్న గోరుముద్ద : సీఎం జగన్‌

-

జ‌గ‌న‌న్న గోరుముద్ద‌లో మ‌రో పోష‌కాహారం జ‌త‌చేస్తూ నేటి నుంచి బ‌డి పిల్ల‌ల‌కు ఉద‌యం పూట రాగి జావ అందించే కార్య‌క్ర‌మాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి అడుగులోనూ పిల్లలను చేయిపట్టి నడిపిస్తున్నామన్నారు.

గోరుముద్దను ఇప్పటికే రోజుకొక మెనూతో అమలు చేస్తున్నాం. నేటి నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తూ.. గోరుముద్ద కార్యక్రమాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేసేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు సీఎం వైయస్ జగన్. పిల్లల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.. జగనన్న గోరుముద్ద అన్నారు సీఎం జగన్‌. ప్రభుత్వ పథకాలపై చిన్నారి మాటలకు సంతోషిస్తూ చిరునవ్వులు చిందించారు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. కాగా.. రాగిజావ పంపిణీ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news