బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

-

కవితను మహిళా అని చూడకుండా రెండు సార్లు ఈడీ అధికారులు వేధింపులకు గురి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి పైన ఎదురు దాడి చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ అని అన్నారు. రాష్ట్రం పైన కేంద్రం పక్షపాత ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. బీజేపీ పార్టీ లో ఒక్కరి పైన కూడా ఈడి, సిబిఐ విచారణ లేదన్నారు ఇంద్రకరణ్ రెడ్డి.

మల్లారెడ్డి, కమలాకర్ పైన ఈడీ, సిబిఐ వేధింపులు జరుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పైన రేవంత్ రెడ్డి ఆధారాలు చూపెట్టి మాట్లాడాలని హితవు పలికారు. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కిషన్ రెడ్డి రాజీనామా చేయమంటే పారిపోయాడని ఎద్దేవా చేశారు. స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ ఎక్కడ వుందని ప్రశ్నించారు ఇంద్రకరణ్ రెడ్డి. బిజెపి భారత రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news