CM Jagan Sankranti : సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్‌ దంపతులు

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.

అనంతరం గోశాలలో గోపూజ చేశారు సీఎం జగన్ దంపతులు. ఆపై భోగి మంటను వెలిగించిన సీఎం జగన్, హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు.

రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్ కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news