రేపు విశాఖ పర్యటనకు సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొని అనంతరం పలు శుభకార్యాలలో పాల్గొనబోతున్నారు. రేపు ఉదయం 9:15 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10:30 గంటలకు విశాఖ చేరుకుంటారు.

అక్కడినుండి నేరుగా చినమూషివాడలోని శ్రీ శారదా పీఠానికి 11 గంటలకు చేరుకొని వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడి నుండి బయలుదేరి అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్ హాల్ లో జరగనున్న అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ లీల స్రవంతి వివాహానికి హాజరవుతారు.

అనంతరం 1:30 గంటలకు ఎంవివి సత్యనారాయణ నివాసానికి చేరుకొని ఆయన కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానికా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతారు. అక్కడి నుండి బయలుదేరి రెండు గంటలకు ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, భవ్య దంపతులను వారి నివాసంలో ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత విశాఖ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు తిరిగి తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news