నేడు గద్వాలలో సీఎం కేసీఆర్‌ పర్యటన

-

నేడు గద్వాలకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ రానున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా తెలిపింది. నేడు గద్వాలకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ రానున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా తెలిపింది. ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి ఇంటి కెళ్లి.. ఆయనను పరామర్శించనున్నారు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు. ఇటీవల టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… పార్టీ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డిను, ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ పరామర్శించనున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో… జోగులాంబ గద్వాల జిల్లాలకు సీఎం కేసీఆర్‌ చేరనున్నారు. ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి.. కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం… తిరిగి హైదరాబాద్‌ వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. ఇక సీఎం కేసీఆర్‌ తో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు రానున్నారు

Read more RELATED
Recommended to you

Latest news