అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

-

తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. మొద‌ట‌గా పోలీసులు అమరవీరులకు గన్‌ సెల్యూట్ నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత అమ‌ర‌వీరుల‌కు సీఎం కేసీఆర్, మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు నివాళుల‌ర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. అనంత‌రం అమ‌ర‌వీరుల‌పై ప్ర‌ద‌ర్శించిన ప్ర‌ద‌ర్శ‌న‌ను సీఎం కేసీఆర్, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు తిల‌కించారు.

CM KCR | Jai Telangana.. Chief Minister KCR inaugurated the Martyrs'  Memorial – Namasthe Telangana

అమ‌రుల స్మార‌క కేంద్రంలో విశాల‌మైన స‌భా మందిరం, ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రద‌ర్శన కోసం థియేట‌ర్, ఉద్యమ ప్రస్థానాన్ని వివ‌రించే ఫోటో గ్యాల‌రీ, ఉద్యమ చ‌రిత్రకు సంబంధించిన గ్రంథాల‌యం, ప‌రిశోధ‌నా కేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ కార్పొరేష‌న్ల చైర్మన్లు, జిల్లా పరిష‌త్ చైర్మన్లు, ఇత‌ర ప్రజాప్రతినిధులు, మేధావులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news