దూకుడు పెంచిన కెసిఆర్.. రేపు ప్రగతి భవన్ లో ఎంపీలతో కీలక సమావేశం

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన రేపు 1:00 గంటల సమయంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రగతి భవన్ లో జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… లోక్ సభ అలాగే రాజ్యసభలో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు గులాబీ బాస్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

kcr
kcr

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, అలాగే కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై టిఆర్ఎస్ పార్టీ ఎంపీలకు నివేదికలు సీఎం కేసీఆర్ అందించనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయసభల్లో టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు… కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథా పై సీఎం కేసీఆర్ ఎంపీలకు సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇక ఈ సమావేశానికి తెలంగాణ పార్లమెంటు సభ్యులతో పాటు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news