ఇది ఆరంభం మాత్రమే.. కేంద్రంపై యుద్దం ఆగదు : కేసీఆర్

-

ఇది ఆరంభం మాత్రమే… కేంద్రంపై ఇక యుద్దం ఆగదని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు స్పష్టం చేశారు. కాసేపటి క్రితమే.. హైదరాబాద్‌ ఇందిరా పార్కు దగ్గర టీఆర్ఎస్‌ మహాధర్నాలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకత తో ఉందని… కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా యుద్ధానికి దిగామన్నారు.

ఇది ఆరంభం మాత్రమే.. ఇంకా ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు కేసీఆర్‌. పంజాబ్ లో కొన్నట్లు ఇక్కడ కూడా వరి ధాన్యం కొనాలని స్వయంగా కోరానని… ప్రధానికి లేఖ రాసిన ఉలుకు లేదు పలుకు లేదని ఫైర్‌ అయ్యారు. ఇది ఈ రోజుతో ఆగేది లేదని…కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదన్నారు. కేంద్ర ప్రభుత్వం వండ్లు కొనుగోలు చేసే వరకు.. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ గ్రామాన ధర్నాలు చేయాలని పిలుపు నిచ్చారు కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news