కేసీఆర్ జిల్లాల టూరు షురూ..రేపు, ఎల్లుండి జనగామ, యాదాద్రి జిల్లాల్లో పర్యటన

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాల పర్యటన ఖరారు అయింది. రేపు, ఎల్లుండి జనగామ జిల్లా అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లా లో నూతనంగా నిర్మించిన మరో రెండు కలెక్టరేట్ భవనాలను ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన భవన సదుపాయాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ సమీకృత భవనాల ను నిర్మించింది ప్రభుత్వం. మరో ఆరు జిల్లాల్లో ప్రారంభించినందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో… రేపు జనగామ జిల్లా లో కలెక్టర్ కార్యాలయం, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఇక శనివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టరేట్ భవనాలను, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం లో భాగంగా నూతనంగా కట్టిన ప్రెసిడెన్షియల్ సూట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news