రెండో పెళ్లి చేసుకున్న కేరళ సీఎం కూతురు..!

-

కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణా త‌యికండియిల్(43) ఇవాళ రెండ‌వ వివాహం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న ఆమె.. డీవైఎఫ్ఐ అధ్య‌క్షుడు పీఏ మొహ‌మ్మ‌ద్ రియాస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇవాళ ఉద‌యం తిరువ‌నంత‌పురంలో ఈ వివాహ వేడుక చాలా సాదాసీదాగా జ‌రిగింది. స్పెష‌ల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. సీఎం అధికార నివాసంలో కేవ‌లం కొద్ది మంది అతిథుల మ‌ధ్య వేడుక నిర్వ‌హించారు. గత ఎన్నికల్లో కోజికోడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన రియాస్‌ కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారు. రియాస్‌కి 2002లో మొదటి పెళ్లి జరిగింది. 2015లో తన భార్యకు ఆయన విడాకులు ఇచ్చారు. ఆయనకు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. వీణ మొదటి భర్తకు 2015లో విడాకులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news