సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి: సీఎం వైఎస్ జగన్

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ‘చంద్రబాబును గెలిపించేందుకు ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ రంగప్రవేశం చేసింది. హస్తం పార్టీకి ఓటేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీఏను గెలిపించడం కాదా? చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్తో కాపురం చేస్తారు. రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయి. ఎంపీ అవినాశ్ జీవితాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ కుట్ర చేస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. కడప సభలో పరోక్షంగా షర్మిలపై మండిపడ్డారు. ‘రాజకీయంగా వైఎస్ఆర్ కుటుంబాన్ని అణగదొక్కాలని అన్ని వ్యవస్థలను ప్రయోగించిన కాంగ్రెస్ పార్టీ , తెలుగుదేశం పార్టీ తో కలిసిపోయిన వాళ్లు వైఎస్సార్ వారసులా? నన్ను 16 నెలలు అన్యాయంగా జైలులో పెట్టారు. ఆ కాలాన్ని నాకు ఎవరు తిరిగిస్తారు?’ అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news