Beer Companies: ఆ బీర్ల కంపెనీల‌కు తాగింది దిగేలా షాక్‌ ! రూ.873కోట్ల ఫైన్

-

Beer Companies: బీర్ల కంపెనీలకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) దిమ్మ‌తిరిగే షాకింగ్ ఇచ్చింది. మార్కెట్‌ నిబంధనల‌కు విరుద్దంగా ధ‌ర‌ల పెంచుతున్న, సీసీఐ నియ‌మావ‌ళికి వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తున్న బీర్ల కంపెనీలపై సీసీఐ శుక్రవారం కొరడా ఝుళిపించింది. ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.873కోట్ల ఫైన్ వేసింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్‌బర్గ్ ఇండియా, ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ లతో పాటు మరో 11 మందిపై ఏకంగా రూ.873 కోట్లకుపైగా జరిమానా విధించింది.

కాంపిటీషన్ లాను వ్య‌తిరేకిస్తూ.. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ సేల్, సప్లై విషయంలో ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీసహా పలు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు, సరఫరాల్లో కూటమిగా ఏర్పడి మార్కెట్‌ స్వేచ్ఛను దెబ్బతీశారని పేర్కొంది సీసీఐ.
పెనాల్టీని తగ్గిస్తూ.. బెనిఫిట్ ఇచ్చామని చెప్పింది.

సబ్ మైలర్ ఇండియా లిమిటెడ్ కు 100శాతం, యూబీఎల్ కు 40శాతం, సీఐపీఎల్ కు 20శాతం తగ్గింపు ఇస్తున్నట్లు చెప్పింది. ఇందులో యూబీఎల్, కార్ల్స్‌బర్గ్ ఇండియాల జరిమానాల మొత్తం రూ.752కోట్లు, రూ.121కోట్లుగా ఉండనుంది. సబ్ మైలర్స్ ఇండియా లిమిటెడ్ కు రూ.6.25లక్షలు జరిమానాగా విధించారు. సీజ్ చేయకుండా జరిమానా మాత్రమే విధించామని అధికారులు చెప్తున్నారు. దాదాపు నాలుగేండ్ల సమగ్ర దర్యాప్తు అనంతరం సీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news