కేసీఆర్ కు షాక్ ; దళిత బంధుపై హుజురాబాద్ లో దళితుల ఆందోళనలు

-

హుజురాబాద్ నియోజక వర్గంలో దళిత బంధు పథకం పంపిణీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. హుజురాబాద్‌ నియోజకవర్గ వ్యాప్తంగా 21 వేల కుటుంబాలను అర్హులుగా గుర్తించింది తెలంగాణ సర్కార్‌. మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా 5000 వేల కుటుంబాలకు దళిత బంధు ని ఇవ్వాలని భావించింది ప్రభుత్వం. అయితే.. ఈ నేపథ్యంలోనే అర్హులకు దళిత బంధు రావడం లేదంటూ… దళితులు ఆందోళనకు దిగుతున్నారు. దళిత బంధు పై నిన్నటి నుంచి హుజురాబాద్ లో ఆందోళనలు చేశారు దళితులు. అర్హులకు ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు దళితులు.

హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా దళితుల ఆందోళన కొనసాగుతోంది. అటు ఇళ్ళందకుంట మండల కేంద్రంలోనూ దళితులు ర్యాలీ నిర్వహించారు. దళిత బంధు కోసం 470 మంది దరఖాస్తు చేసుకుంటే 40 మందిని ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిక అయిన వారిలో ఎక్కువ శాతం స్థానికులు లేరని, బయటి వారు ఉన్నారని మండిపడుతున్నారు దళితులు. దళితుల నుంచి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని డిమాండ్ రావడం తో నేరుగా రంగంలోకి దిగిన మంత్రి హరీష్ , సీఎస్ కరీంనగర్ లోనే సమీక్ష నిర్వహించనున్నారు. దళిత బంధు పై ఆందోళనలు, సీఎం సభ, అర్హుల ఎంపిక పై ఈ సమీక్షలో చర్చించనున్నారు.. ఎల్లుండి హుజురాబాద్ కు సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో దళితుల ఆందోళనలు టీఆరెస్ పార్టీ నేతల్లో టెన్షన్ రేపుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news