ముగిసిన సునీల్ కనుగోలు విచారణ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు బిఆర్ఎస్ నేతలపై కించపరిచే విధంగా పోస్టింగులు చేస్తున్నారని ఆరోపణల పై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు మాదాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్ రూమ్ పై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న ఇషాన్, శశాంక్, ప్రదీప్ లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారికి నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు.

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావలసిందిగా నోటీసులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆయన సిసిఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వీడియోల మార్ఫింగ్, పోస్టింగులపై గంటపాటు సునీల్ కనుగోలును విచారించారు పోలీసులు. ఆయన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్నారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news