కాంగ్రెస్ వచ్చింది.. ఆరు నెలల్లోనే ఆగమయ్యినం :కేటీఆర్ ట్వీట్

-

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు.విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ?పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ?ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప..ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని మండిపడ్డారు.నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..!నేడు.. విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు..!!పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి.. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అని అన్నారు.

సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు..ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్ లో నిలబడితే..సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా అని విమర్శించారు. గత పదేళ్లపాటు.. 10 నిమిషాల్లో అందిన విత్తనాలు..10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ??రంగారెడ్డి నుంచి.. కామారెడ్డి దాకా..రైతులకు ఏమిటీ కష్టాలు.. ఇంకెన్నిరోజులు ఈ కన్నీళ్లు..దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ.. అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తారా ??బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్నిఅధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా ??ఇప్పటికైనా.. సరిపడా విత్తనాల స్టాక్ తెప్పించండి..!బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా కళ్లెం వేయండి..!!కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం అంటున్న.. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి..లేకపోతే..రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని..కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news