టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పోరు… తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. మే 4,5న రాష్ట్రానికి రాహుల్

-

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు ప్రస్తుతం రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశం అయిన సందర్భంతో రాష్ట్ర నాయకులు తెలంగాణలో పర్యటించాల్సిందిగా రాహుల్ గాంధీని కోరారు. తాజాగా మే 4,5 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన ఉండనుంది.

మే 4 తేదీన వరంగల్ లో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మే 5న బోయిన్ పల్లిలో  కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు రాహుల్ గాంధీ. నిన్న గవర్నర్ తో సమావేశం అయిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలు, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి పోరాడేందుకు త్వరలోనే రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తారని వెల్లడించారు. ఆ మరుసటి రోజు అంటే ఈ రోజు రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. రాహుల్ పర్యటనలో కాంగ్రెస్ నేతల్లో, కార్యకర్తల్లో మరింత విశ్వాసం పెరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news