బ్రేకింగ్; ఏపీలో 62 కొత్త కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసుల తీవ్రత పెరుగుతుంది గాని తగ్గే అవకాశాలు ఎక్కడా కూడా కనపడటం లేదు. తాజాగా ఆంద్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 27 కేసులు నమోదు అయ్యాయి.

దీనితో కేసుల సంఖ్య 955 కి చేరుకుంది. కృష్ణా జిల్లాలో 14 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 11 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు, ప్రకాశం 3, తూర్పు గోదావరి 2 కేసులు, నెల్లూరు ఒక్క కేసు నమోదు అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 781 కేసులు ఉన్నాయి. 145 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని ఏపీ సర్కార్ వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news