టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే కరోనా కలకలం.. కలవరపడుతోన్న క్రీడాకారులు

-

టోక్యో: ఒలింపిక్స్ క్రీడలకు ప్రారంభానికి ముందే కరోనా కలకలం రేగింది. తొలి కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. ఈ నెల 13 నుంచి ఒలింపిక్స్ క్రీడా గ్రామాన్ని నిర్వహకులు తెరిచారు. ఈ క్రీడా గ్రామంలో క్రీడాకారులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఒకరికి పాజిటివ్ వచ్చింది. కానీ వారి పేరు బయటకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తిని ఓ హోట‌ల్‌లో ఐసోలేషన్ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. మొత్తం 11 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఒలింపిక్స్ ఇప్పటికే ఆలస్యమ్యాయి. గతేడాది ఈ క్రీడలు నిర్వహించాల్సి ఉంది. కరోనా కరణంగా అప్పడు వాయిదా వేశారు. తాజాగా ఒలింపిక్స్ నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాజాగా కరోనా కేసు నమోదు కావడంతో క్రీడాకారుల్లో కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒలింపిక్ క్రీడా గ్రామంలో పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రతిఒక్కరు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. మరో ఆరు రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కరోనా కలకలం రేగింది.

 

Read more RELATED
Recommended to you

Latest news