కేరళలో కొత్తగా 5 కరోనా కేసులు

-

కరోనా వైరస్ నేడు ప్రపంచాన్ని వణికిస్తోన్న పేరు. ఇప్పుడు ఇండియాలో కూడా క్రమక్రమంగా విస్తరిస్తోంది. తొలుత ఈ వైరస్ బారిన పడ్డ వ్యక్తిని కేరళలో గుర్తించారు. కొద్ది రోజులకే వారికి నయం కావడంతో కేరళలో కరోనా ప్రభావం తగ్గిందని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ కేరళలో కరోనా పడగ విప్పుతోంది..

మరోె ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా వచ్చిందని వారి కుటుంబ సభ్యులైన మరో ముగ్గురికి ఈ వ్యాది సోకినట్టు మంత్రి వెల్లడించారు. ఇటలీ నుంచి వచ్చిన వారు ఎలాంటి సమాచారం అందించలేదని, ప్రస్తుతం వారిని ఐసోెలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నామని తెలిపారు…

కాగా ఈ ఐదు కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ 39 మందికి కరోనా వైరస్ సోకినట్టు లెక్కలు తేలాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరోనాను అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news