దేశంలో 40 వేల దిగువకు కరోనా కేసులు… తాజా హెల్త్ బులెటిన్ ఇదే..!

-

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 40 వేల దిగువకు వచ్చాయి. కొత్తగా 38 వేల 792 కేసులు నమోదు అయ్యాయి. 624 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకూ 3 కోట్ల 9 లక్షల 46 వేల 74 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటవరకూ 4 లక్షల 11 వేల 408 మంది చనిపోయారు.

దేశంలో మరో 41 వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 3 కోట్ల లక్షా 4 వేల 720 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 4 క్షల 29 వేల 946 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకూ 38 కోట్ల 76 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్రవైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు

Read more RELATED
Recommended to you

Latest news