గడిచిన 24 గంటల్లో కల్లోలం… కొత్తగా ఎన్ని కేసులంటే..

-

coronavirus
coronavirus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటన్‌ను విడుదల చేసింది. లెక్కలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3 లక్షల 66 వేల 161 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3 వేల 754 మంది కరోనాతో చనిపోయారు. 24 గంటల్లో మొత్త 3 లక్షల 53 వేల 818 మంది డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 2 కోట్ల 26 లక్షల 62 వేల 575కి కరోనా సోకింది. 1 కోటి 86 లక్షల 71 వేల 222 కోలుకున్నారు. 37 లక్షల 45 వేల 237యాక్టీవ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో 2 లక్షల 46 వేల 116 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 17 కోట్ల 1 7, లక్షల 6 వేల 603 మంది కోవిడ్ టీకా తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news