BREAKING : మంత్రి పేర్ని నానికి కరోనా పాజిటివ్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ మహమ్మారి చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతరులకు సోకింది. ఇక తాజాగా ఏపీ సినిమాటో గ్రఫీ మంత్రి పేర్ని నానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో హోమ్ ఐషోలేషన్లోకి వెళ్లారు మంత్రి పేర్ని నాని. కోవిడ్ కారణంగా ఇవాళ ఉద్యోగ సంఘాలతో చర్చలకు హాజరు కాలేకపోతున్నారు పేర్ని నాని.

ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్‌ మీడియాలో మంత్రి పేర్ని నాని ప్రకటన చేశారు.”తాను ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను హోం ఐసోలేషన్‌ లో ఉన్నారు. నాతో ఈ మధ్య కాలంలో కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలి.” అని మంత్రి పేర్ని నాని కోరారు.కాగా.. ఈ మధ్య కాలంలో మంత్రి కొడాని నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, చంద్రబాబు, లోకేష్‌ కరోనా బారీన పడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Latest news