లిఫ్ట్‌ బటన్‌ ద్వారా 20 మందికి కరోనా

-

ఖమ్మంలో లిఫ్ట్‌ బటన్‌ ద్వారా 20 మందికి కరోనా సోకింది. ఖమ్మం బైపాస్‌ రోడ్డులో గల ఓ అపార్ట్‌మెంట్‌లో 2 వారాల్లో 20 మందికి కరోనా సోకడంతో కలకలం రేగింది. వీరిలో ఓ వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ చనిపోయాడు. అయితే, గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు. దీంతో లిఫ్ట్‌ బటన్‌ వల్లే కరోనా వ్యాపించినట్టు నిర్ధారించారు అధికారులు.

ఇక ఖమ్మం జిల్లా మధిర నిన్న దారుణం జరిగింది. కరోనా వచ్చిందన్న అనుమానంతో ఇళ్ళలోకి వెళ్లి మరి గ్రామస్తులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా లేదని చెప్పినా వినకుండా మహిళలు పిల్లలపై కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. గాయపడ్డ మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ గ్రామానికి పూజ చేసేందుకు కరోనా భయంతో పురోహితుడు రాలేదు. అయితే అలా రాకపోవడానికి వీరే కారణం అని కరోనా అనుమానం ఉన్న కుటుంబాల మీద దాడికి తెగబడ్డారు గ్రామస్తులు.

Read more RELATED
Recommended to you

Latest news