మంత్రికి కరోనా, ఆందోళనలో సిఎం జగన్…?

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా కేసులు ఏమో గాని, అధికార పార్టీ నేతలు మాత్రం భయపడుతున్నారు. అధికార పార్టీ నేతలను కరోనా భయం వెంటాడుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ప్రతీ ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చింది. అంత వరకు బాగానే ఉంది గాని… ఇప్పుడు ఆయనకు కరోనా రావడం సిఎం జగన్ ను ఇబ్బంది పెడుతుంది.

గత వారం రోజుల నుంచి మంత్రి గారు… సిఎం జగన్ ని పలు కీలక అంశాల మీద కలిసి చర్చలు జరిపారు. జగన్ కు ఆయన అత్యంత సన్నిహిత మంత్రి కూడా. దీనితో సిఎం జగన్ ఇప్పుడు కరోనా విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఆయన తాడేపల్లి సిఎం క్యాంప్ ఆఫీస్ కి పలు మార్లు వచ్చారు కూడా వారం పది రోజుల్లో. ఆయనకు లక్షణాలతో కూడిన కరోనా వచ్చింది అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news