బ్రేకింగ్ : రాజధానిలో  ల‌క్ష దాటిన క‌రోనా కేసులు..!

-

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు.

అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. కాగా, తాజాగా.. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,379 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ కాగా, 48 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,823కు చేరగా.. మృతుల సంఖ్య 3,115కు చేరుకుంది. సోమ‌వారం ఒక్క‌రోజే క‌రోనా నుంచి 749 మంది కోలుకోగా, ఇప్ప‌టి వ‌ర‌కు 72,088 మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news