బిగ్ బ్రేకింగ్ : రాజధానిలో 3వేలు దాటిన కరోనా మరణాలు

-

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు.

అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. కాగా, తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,505 కరోనా కేసులు నమోదయ్యాయి. 55 మంది మరణించారు. 2,632 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 97,200కి చేరింది. వీరిలో 25,940మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 68,256మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 3,004మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news