ఇండియాలో కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో ఏకంగా..!

-

దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా.. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 34,884 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

corona virus
 

అదే సమయంలో 671 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 10,38,716కి చేరగా, మృతుల సంఖ్య 26,273కి పెరిగింది. ప్రస్తుతం 3,58,692 మందికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా కరోనా నుంచి ఇప్పటి వరకు 6,53,750 మంది కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news