కరోనా కలకలం.. భారత్ లో భారీగా నమోదైన కేసులు..!

-

భారత్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రజలకూ, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏరోజుకారోజు నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే ఎంతో మంది మరణించారు. అయినా ఇది మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. పరీక్షలు పెంచే కొద్ది కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,601 కరోనా పాజిటివ్ కేసులు, 871 మరణాలు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

corona

దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675 కు చేరింది. కరోనా మరణాల సంఖ్య 45,257కు పెరిగింది. అలాగే భారత్ లో ఇప్పటివరకూ 15,83,489 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 6,39,929 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news