కరోనా ఉగ్రరూపం : ఏపీలో రికార్డ్ బ్రేక్.. తెలంగాణలో కూడా..! ఎన్నో తెలిస్తే షాక్..!

-

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 2,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 44 మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 35,451కు చేరగా, మృతుల సంఖ్య 452కు చేరింది. రాష్ట్రంలో మొత్తం 18,378 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 16,621కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

అలాగే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 1159 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,342కి చేరింది. మొత్తం 386 మంది మరణించారు. కరోనాతో ఇప్పటివరకూ కోలుకుని 25,999 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,958 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news