రాష్ట్రంలో భారీగా త‌గ్గిన క‌రోనా.. 500 క‌న్నా త‌క్కువే

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌త కొద్ది రోజుల నుంచి కూడా భారీ సంఖ్య‌లో కేసులు ప‌డిపోతున్నాయి. ఈ రోజు రాష్ట్ర క‌రోనా బులిటెన్ ను విడుదల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 32,932 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. కేవ‌లం 429 క‌రోనా పాజిటివ్ కేసులు మాత్ర‌మే వెలుగు చూశాయి. థ‌ర్డ్ వేవ్ వ‌చ్చిన నాటి నుంచి 500 దిగువ క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.

నేటి కేసులతో ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 7,83,448 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే ఈ రోజు క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ఒక‌రు మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు 4,107 క‌రోనా మ‌ర‌ణాలు సంభవించాయి. కాగ గ‌డిచిన 24 గంట‌ల‌లో 2,421 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 11,681 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. కాగ దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ విస్త్ర‌తంగా వ్యాప్తి చెంద‌డంతో భారీ సంఖ్య‌లో కేసులు న‌మోదు అయ్యాయి. ఇటీవ‌ల వ్యాప్తి త‌గ్గ‌డంతో రోజు రోజుకు క‌రోనా పాజిటివిటీ త‌గ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news