నాచుతో నిండిపోయిన అడవి గురించి విన్నారా.. దేశంలో ఇదే మొదటిది..

-

దేశంలోనే మొట్టమొదటి నాచుతో నిండిపోయిన అడవి ఉత్తరాఖండ్ లో సిద్ధం అయింది. పూర్తిగా నాచుతో నిండి ఉన్న ఈ అడవి నైనిటాల్ లో 10హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. అడవుల రక్షణ, భూమి మీద జీవవైవిధ్యం.. మొదలగు వాటిని పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ని చేపట్టారు. స్టేట్ కాంపెన్సేటరీ అఫ్ఫారెస్ట్రేషన్ ఫండ్ మేనేజ్ మెంట్ ప్లానింగ్ అథారిటీ కింద 2019లో దీనికి అనుమతి లభించింది. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రస్ సింగ్ గారిచే ప్రారంభ కార్యక్రం జరిగింది.

నాచులో పెరిగే ఎన్నో జీవరాశులకి ఇది ఆలవాలంగా మారనుంది. ఈ 10హెక్టార్ల పార్కు మనిషిని, ప్రకృతిని మరింత దగ్గర చేస్తుందని రాజేంద్ర సింగ్ గారు అన్నారు. నాచులో జీవించే ఎన్నో జీవరాశులకి నివాసంగా ఉండే ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది. ప్రవేశ ద్వారం ముందు పూర్తిగా నాచుతో కప్పబడిన డైనోసార్ ఆకారం కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news