మంత్రికి రెండు నెల‌ల జైలు శిక్ష‌.. ఎందుకో తెలుసా..?

-

ఒక త‌ప్పు ఓ మంత్రికి రెండు నెల‌ల జైలు శిక్ష విధించేలా చేసింది. జైలు శిక్ష‌తో పాటు జ‌రిమానా కూడా క‌ట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వివరాళ్లోకి వెళ్లితే.. మ‌హారాష్ట్ర మంత్రి బ‌చ్చు క‌డూకి అమ్రావ‌తి కోర్టు జైలు శిక్ష‌తో పాటు రూ.25వేలు జ‌రిమానా కూడా విధించింది. 2014 మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అఫిడ‌విట్‌లో ఆస్తుల వివ‌రాల‌ను త‌ప్పుగా న‌మోదు చేశారు.

అయితే ఆ ఎన్నిక‌ల్లో బ‌చ్చు క‌డూ అచ‌ల్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. విజ‌యం సాధించిన త‌రువాత ఆయ‌న మంత్రి ప‌ద‌వీ కూడా చేప‌ట్టారు. పోటీ చేసిన స‌మ‌యంలో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌లో ముంబైలో త‌న‌కు ఉన్న ఫ్లాట్ వివ‌రాల‌ను న‌మోదు చేయ‌లేదు. దీనిపై బీజేపీ కౌన్సిల‌ర్ గోపాల్ తిర‌మ‌రే కోర్టును ఆశ్ర‌యించారు. ఎప్ప‌టి నుంచో విచార‌ణ జ‌రుగుతుండ‌గా.. శుక్ర‌వారం విచార‌ణ ముగించింది కోర్టు.

ముఖ్యంగా ప్ర‌జాప్రాతినిథ్యం చ‌ట్టం ప్ర‌కారం.. పాఠ‌శాల విద్యాశాఖ స‌హాయ మంత్రిగా ఉన్న బ‌చ్చు క‌డూను దోషిగా తేల్చి.. రెండు నెల‌ల కాలం పాటు జైలు శిక్ష‌, రూ.25వేలు జ‌రిమానా విధించింది. దీనిపై కోర్టుకు వెళ్లేందుకు స‌మ‌యం ఇవ్వాల‌ని, బెయిల్ మంజూరు చేయాలంటూ బ‌చ్చు క‌డూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. సానుకూలంగా స్పందించిన కోర్టు పై కోర్టులో అప్పిల్‌కు నెల రోజుల స‌మ‌యం ఇవ్వ‌డంతో పాటు బెయిల్ మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news