గుంటూరులో డేంజర్ బెల్స్… భారీగా కేసులు నమోదు

-

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది. రోజురోజుకు అనేక సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స కోసం వచ్చిన వారికి కరోనా ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. మాచర్లకు చెందిన ఒకరికి… తెనాలి, విజయవాడకు చెందిన మరో ఇద్దరికి కరోనా సోకినట్లుగా సమాచారం అందుతోంది. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

covid
covid

కాగా, మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 5 వేలకు పైనే దాటినట్లుగా సమాచారం అందుతుంది. కాగా నిన్న ఒక్కరోజులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 కరోనా పాజిటివ్ కేసులో నమోదు అయ్యాయి. ఈరోజు మూడు కేసులు నమోదు అయ్యాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75కి చేరింది. కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచనలు చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులకు కరోనా వ్యాప్తి తొందరగా వచ్చే అవకాశం ఉండడంతో అసలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news