వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మోదీ మీటింగ్.. ఆ రాష్ట్రాల సీఎంలు, అధికారులతో సమావేశం

-

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఇటీవలే ఇండియా 100 కోట్ల డోసుల రికార్డను దాటింది. దేశంలో 60 శాతం కన్నా ఎక్కువ జనాభా కనీసం ఒక్కడోసు వ్యాక్సిన్ అయినా తీసుకున్నారు. అయతే కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వెనుకబడి ఉన్నాయి. దీంతో వీటిపై కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ తీసుకోనుంది. తాజాగా ప్రధాన మంత్రి మోదీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పై సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 3 రోజున సమావేశం జరుగనుంది. దేశంలో తక్కువ వ్యాక్సినేషన్ నమోదు చేసిన 40 జిల్లాల కలెక్టర్లతో పాటు ఆ రాష్ట్రాల సీఎంలతో సమావేశం జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వాారా మీటింగ్ జరుగనుంది. ఈ 40 జిల్లాలు జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర మరియు మేఘాలయలో విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాల్లో 50 శాతం కన్నా తక్కువ వ్యాక్సినేషన్ నమోదైంది. ప్రస్తుతం ప్రధాని మోదీ జీ-20 సమావేశం కోసం ఇటలీలో ఉన్నారు. స్వదేశానికి తిరిగి రాగానే సమావేశం ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news