భర్త నిద్రపోతుంటే.. రాత్రి ప్రియుడితో కలిసి కారులో..!

-

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గొల్లపల్లికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి అతని భార్య లక్ష్మి రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… వెంకట్ రెడ్డి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకటరెడ్డి శుభకార్యాలకు వంటలు చేస్తూ ఉంటాడు. అతని భార్య లక్ష్మి ఇంటి వద్ద కిరణ్ మనం అలాగే బెల్టుషాపులు నిర్వహిస్తోంది.

అయితే ఈ నేపథ్యంలోనే వెంకట స్వామి అనే వ్యక్తి తో లక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే భర్త వెంకటరెడ్డి నిద్రపోతుంటే భార్య లక్ష్మి శుక్రవారం రాత్రి రోకలిబండతో కొట్టి హత్య చేసింది.

రాత్రివేళ ప్రియుడు వెంకటస్వామి తో కలిసి కారులో మృతదేహాన్ని హుస్నాబాద్ మండలం పొట్లపల్లి వాగు లో పూడ్చేసింది. అయితే దీనిపై వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news