శృంగారంలో పాల్గొనాలని.. కూతురిపై తల్లి దారుణం…!

-

టీనేజర్ పై అత్యాచారం కేసులో యువకుడితో పాటు, అతడి తల్లిని కూడా పోలీసులు నిందితులుగా చేర్చారు. మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన బాధితురాలు ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తోంది. ఈ ఏడాది మే నెలలో సంస్థ పనిమీద భోపాల్ వెళ్లిన టీనేజర్, నిందితుడు అభిషేకు కుర్లిని కలిసింది.

ఈ సమయంలో యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవాలని అభిషేక్, అతడి తల్లి రజని బలవంతం చేసినట్టు ఆరోపించింది.

“నిందితుడి తల్లి రజనీపై కూడా ఫిర్యాదు చేసిన వారి ప్రకారం, ఇద్దరూ ఇతర పురుషులతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని బాలికను ఒత్తిడి చేశారు. ఆమె మొబైల్ ఫోను తస్కరించారు, అభ్యంతరకరమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు” అని పోలీసులు తెలిపారు. తల్లి కుమారులపై అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news