గుంటూరులో ఘోరం: పిల్లలకు విషమిచ్చి తాను తాగిన తల్లి

-

అనుమానపు భర్తతో విసిగిపోయిన ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకున్నది. తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగింది. ఈ విషాద ఘటనలో తల్లి కూతురు మృతిచెందగా, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

గుంటూరు జిల్లా నూజండ్ల మండలం అన్నారం గ్రామానికి చెందిన లక్ష్మణుడు, సౌజన్య ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి అఖిల(11), అజయ్ (9) సంతానం. భార్య సౌజన్యపై అనుమానం పెంచుకున్న లక్ష్మణుడు నిత్యం వేధించడం మొదలు పెట్టాడు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. సోమవారం రాత్రి కూడా గొడవ జరగడంతో తనువు చాలించాలని సౌజన్య నిర్ణయించుకున్నది.

భర్త నిద్రపోయిన తర్వాత కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని సౌజన్య తాగింది. తన తర్వాత పిల్లకు దిక్కెవరని భావించి నిద్రపోతున్న కొడుకు, కుమార్తె లేపి తాగించింది. నిద్రమత్తులో ఉన్న అఖిల పూర్తిగా తాగగా, అజయ్ కొద్దిగా తాగి వాంతులు చేసుకుని తండ్రి దగ్గరకు వెళ్లాడు.

పరిస్థితి గమనించిన లక్ష్మణుడు బంధువులకు సమాచారం అందించాడు. హాస్పిటల్‌కు తరలించగా మంగళవారం అఖిల, బుధవారం సౌజన్య ప్రాణాలను కోల్పోయారు. చికిత్స అనంతరం కోలుకున్న అజయ్ క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news