ఏపీ కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త.. భారీగా పెరిగిన జీతాలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ లో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్‌ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పింది. లెక్చరర్ల వేతనాన్నిభారీగా పెంచుతూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రక్టు లెక్చరర్లకు ఇటీవలే సవరించిన మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ప్రకారం వేతనాలు చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్టు అధ్యాపకులకు రూ.35.120 వేతనం అందుతోంది.

ఇక ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం… ఉద్యోగుల జీతం రూ.40,270 కి పెరగనుంది. ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచే ఈ పెరిగిన జీతాలు అమలులోకి వస్తాయని జయలక్ష్మి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 316 మంది కాంట్రాక్టు పాలిటెక్నిక్‌ అధ్యాపకులకు మేలు జరుగనుంది. ఇక తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన మినిమమ్‌ టైమ్‌ స్కేలు ప్రకారం వేతనాలు పెంచినందుకు పాలిటెక్నిక్‌ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news