క‌ర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం 6 మంది మృతి

-

6 of a family killed in a road accident in Kurnool
అమ‌రావ‌తి (ఆలూరు): కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలోని పెద్దహోతూరు సమీపంలో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 21మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా కర్నూలు వన్‌టౌన్‌కు చెందినవారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘ‌ట‌నపై సీఎం చంద్ర‌బాబు స్పందించారు. మృతుల‌కు చంద్ర‌న్న బీమా కింద 5 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news