డబ్బుల కోసం ఓ యువకుడి దారుణం.. ఏకంగా ప్రియురాలితోనే బేరం.. ?

-

ప్రేమ అనే పదం వినడానికి పలకడానికి బాగానే ఉంటుంది.. కానీ అందులో పడిన వారికే తెలుస్తుంది దాని లోతు.. ఇక ఈ మధ్య కాలంలో ఎందరో ప్రేమ పేరుతో కొత్తరకం బిజినెస్ సాగిస్తున్నారు.. ఈ ప్రేమను అడ్డుపెట్టుకుని జీవితాలతో ఆడుకుంటున్నారు.. ఇలాంటి ఆటలో కొందరి జీవితాలు అర్దాంతరంగా ముగిస్తే, మరికొందరి విషయంలో మాత్రం లోలోపలే సెటిల్మెంట్లు జరిగుతున్నాయి.. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్న నేటి యువకుల్లో గానీ, యువతుల్లో కానీ ఎలాంటి మార్పు రావడం లేదు..

ఇక తమిళనాడులో కూడా ఇలాంటి అరాచకం ఒకటి వెలుగు చూసింది.. ప్రేమ చాటున వంచనకు గురైన ఆ యువతి మనో వేధన తెలుసుకుంటే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అళగియా పాండిపురానికి చెందిన మార్ఫిన్ గణేష్ (26) అనే యువకుడు సొంతంగా సీడీ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే మంజుల అనే యువతి(26)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా, ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మించి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు.. అంతే కాదు వారిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసి దాచుకున్నాడు.. అయితే ఇటీవల లాక్‌డౌన్ రావడంతో గణేష్ కూ ఆర్థిక ఇబ్బందులు మొదలవగా, అతని మనసులో పుట్టిన దురాలోచనతో, మంజులతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు బయటకు తీసి వాటితో తన ప్రియురాలిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడట..

 

ఈ విషయం బయటకు పొక్కితే ఎక్కడ పరువుపోతుందో అనే భయంతో ఆమె అతడికి చాలా సార్లు డబ్బులు ఇచ్చిందట.. కానీ సంతృప్తిపడని ఈ మోసగాడు ఆ యువతిని ఇంకా వేధించగా తన దగ్గర డబ్బులు లేవని గట్టిగా చెప్పడంతో కక్షగట్టిన అతడు ప్రియురాలి న్యూడ్ వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడట.. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు గణేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారట.. చూశారా అమ్మాయిలు ఆలోచనలేని పనులతో అతిగా నమ్మి చేసిన దానికి వచ్చిన ఫలితం..

Read more RELATED
Recommended to you

Latest news