హైదరాబాద్ లో ఘోరం.. కన్న కూతురిని చంపిన తండ్రి

-

హైదరాబాద్ చందానగర్ లో ఘోరం జరిగింది. కంటికి రెప్పలాగా కాపాడాల్సిన తండ్రి కాలయముడు అయి ఉసురుతీశాడు. ఐదేళ్ల పసి పిల్లను పొట్టన పెట్టుకున్నాడు.  వివరాల్లోకి వెళ్లితే.. చందానగర్ లో నివాసం ఉండే చంద్రశేఖర్ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా ఇంజినీర్ పని చేస్తుంటాడు.

ఎనిమిది నెలల కిందట అతడు పనిచేసే  ఆ  కంపెనీ వారు ఉద్యోగం నుంచి తీసేశారు.  అదే కంపెనీలో భార్య హెచ్ఓడీగా పని చేస్తుంది. కొన్నాళ్లుగా భార్య, కూతురుతో విడిగా ఉంటున్నాడు చంద్రశేఖర్. స్కూల్ లో ఉన్న తన కూతురు మోక్షిత (5) ని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడు చంద్రశేఖర్. పెన్సిల్ బ్లేడ్ తో మోక్షిత గొంతు కోశాడు తండ్రి చంద్రశేఖర్. ఆ తరువాత రోడ్డు ప్రమాదం జరిగిందని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ORR కారుకు ప్రమాదం జరగడంతో హత్యా ఉదంతం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  ఇక పోలీసుల విచారణలో తానే చంపానని అసలు నిజం  ఒప్పుకున్నాడు చంద్రశేఖర్.  

Read more RELATED
Recommended to you

Latest news