భార్యను ముక్కలుగా నరికి పాతిపెట్టిన భర్త

-

కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. తల్లిదండ్రులతో కలిసి భార్యని చంపి 50 ముక్కలుగా చేసి ఊరి బయట పాతిపెట్టాడు. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా.. అతడిని ప్రశ్నించడమే. జార్ఖండ్ లో జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ లోని రాంచీకి చెందిన దిల్ దార్ 2022లో రూబీకా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే పెళ్లయిన కొన్నాళ్లకు దిల్ దార్ కు ఇంతకుముందే పెళ్లయిన విషయాన్ని తెలుసుకుంది రుబీకా. దీంతో భర్తతో తరచూ గొడవపడేది. దీంతో కోపోద్రిక్తుడైన దిల్ దార్ తల్లిదండ్రులతో కలిసి భార్యను చంపి 50 ముక్కలుగా చేసి ఊరి బయట పాతిపెట్టాడు. పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు తెలియడంతో తాజాగా ఈ కేసులో 12 మందిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news