కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది దుర్మరణం.

-

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తుమూకూరు జిల్లాలోని బాలినహల్లిలో ఓ లారీ జీపును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కాగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని రాయచూర్ జిల్లా వాసులుగా గుర్తించారు. అయితే 48వ నంబర్ జాతీయ రహదారిపై రాయచూర్ నుంచి బెంగళూరు వస్తున్న జీపును ఓవర్టేక్ క్రమంలో లారీ ఢీ కొట్టినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news