ఏపీలో దారుణం…భర్తకు తెలియకుండా..లవర్‌ తో లాడ్జీకి యువతి..అంతలోనే !

-

బాలయ్య ఇలాక హిందూపురంలోని ఓ లాడ్జిలో రెసిడెంట్‌ డాక్టర్‌ అక్షిత అనుమానస్పదంగా మృతి చెందింది. ములుగు జి్లా మంగపేటకు చెందిన అక్షిత ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని చిక్‌ బళాపూర్‌ మెడికల్‌ కాలేజీలో రెసిడెంట్‌ డాక్టర్‌ గా పనిచేస్తోంది. భర్త వరంగల్‌ లో ఆర్థోపెడిక్‌ వైద్యుడు.

అక్షిత తన స్నేహితుడైన సంగారెడ్డి పటాన్‌ చెరుకు చెందిన మహేష్‌ తో కలిసి ఉదయం హిందూపురం వచ్చి ఓ లాడ్జి లో బస చేశారు. అక్షిత సాయంత్రం చనిపోయినట్లు ఆ యువకుడు పోలీసులకు ఫోన్‌ చేశాడు. పగలు భోజనం చేసి ఇద్దరు నిద్రపోయామని.. లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని పోలీసులకు చెప్పాడు.

వెంటనే పోలీసులు అక్షిత బంధువులకు సమాచారంర ఇచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మహేష్‌ హైదరాబాద్‌ లో ఇంటీరియల్‌ డిజైనర్‌ గా పని చేస్తున్నట్లు సమాచారం. అక్షితకు ఏడాది వయసు ఉన్న కుమార్తె ఉందని.. స్నేహితుడితో కలిసి ఒంటిరిగా ఇక్కడికి వచ్చారని పోలీసులు తెలిపారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news