షాకింగ్ ట్విస్ట్ : 8 ఏళ్ల కాపురం.. ఓ బిడ్డ.. భార్య కాదు మగాడు..!

-

ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకున్నారు.. 8 ఏళ్ల దాంపత్య జీవితం ఒక బిడ్డతో ప్రశాంతంగా సాగింది. కానీ, ఉన్నట్టుండి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది కాస్త వీరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. చనిపోయిన భార్యభర్తల్లో.. భార్య కూడా మగాడేనట. ఇది తెలిసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని చిన్న పట్టణమైన సెహోర్‌ కు చెందిన ఓ జంట 2012లో వివాహం చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత ఓ బిడ్డను దత్తత తీసుకుని సంసార జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య వివాదం రేగింది. దాంతో భార్య చీరకు నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కాపాడే క్రమంలో భర్తకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయాలతో భార్య చనిపోయింది.

ఆ తర్వాత నాలుగు రోజులకి భర్త కూడా చనిపోయాడు. భార్య శవపరీక్ష నివేదికను పోలీసులు గత వారం అందుకున్నారు. ఈ పరీక్షలో ఆమె స్త్రీ కాదు పురుషుడని ఇచ్చారు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. అసలు విషయంపై ఆరా తీశారు.. ఆ మహిళ సోదరుడు పోలీసులకు పూర్తి విషయం చెప్పేశాడు.. వాస్తవానికి ఆ ఇద్దరు స్వలింగ సంపర్కులని, తమ వివాహాన్ని సమాజం అంగీకరించదనే ఉద్దేశంతో ఒకరు మహిళగా రూపం మార్చుకుని భార్యాభర్తల్లా జీవించడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ప్రజలు కూడా ఆమెను భార్యగానే చూసేవారు. చివరికి.. పోస్ట్‌మార్టం రిపోర్టుతో అసలు విషయం బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news