తునిలో టీడీపీ నాయకుడు శేషగిరిరావుపై హత్యాయత్నం

-

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. మాజీ ఎంపీపీ పోల్నాటి శేషగిరి రావుపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. ఇవాళ ఉదయం 6 గంటలకు అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్న ఓ వ్యక్తి బిక్షమెత్తుకుంటూ శేషగిరి రావు ఇంటి వద్దకు వెళ్లారు. అతడికి బిక్షమెయ్యడానికి శేషగిరి బయటకు వచ్చారు.

అతడు తీసుకొచ్చిన సంచిలో బియ్యం వేస్తుండగా ఆ వ్యక్తి ఒక్కసారిగా శేషగిరిపై కత్తితో దాడి చేశాడు. అతడి తల నరికేందుకు ప్రయత్నించాడు. గమనించిన శేషగిరి వెంటనే అప్రమత్తమై తప్పించుకున్నాడు. అయినా దుండగుడు దాడి చేస్తూనే ఉన్నాడు.. శేషగిరి ప్రతిఘటించేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో శేషగిరి తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి.

శేషగిరి అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. గమనించిన దుండగుడు అక్కణ్నుంచి పరారయ్యాడు. శేషగిరి రావును కుటుంబ సభ్యులు హుటాహుటిన తుని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తీసుకువెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news