లవర్ తో భార్య సీక్రెట్ చాటింగ్, ఆ వీడియో చూసి మరీ !

-

అది విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం గోని వాని పాలెం గ్రామం. హేమలత, శ్రీనివాసరావు అనే ఇద్దరు 2017 లో ఒకే కాలేజీలో చదువుకునేవారు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త రాను రాను ప్రేమగా మారింది. అలా కొన్ని రోజులు గడిచింది. దీంతో కొంత కాలానికి హేమలతకు తల్లిదండ్రుల వివాహం చేశారు. కానీ ప్రేమించిన ప్రియుడు శ్రీనివాస్ ను మాత్రం హేమలత మరిచిపోలేకపోయింది.

అలా భర్తకు తెలియకుండా లవర్ తో సీక్రెట్ గా ఫోన్లో మాట్లాడుతూ, అప్పుడప్పుడు బయట కలుసుకునేవారు. ఈ విషయం ఇటీవల భర్తతో పాటు, హేమలత తండ్రికి తెలిసింది. ఏదో తెలియక చేసిందని హేమలత తండ్రి, అల్లుడికి నచ్చ చెప్పాడు. తన తండ్రికి, భర్తకు తెలిసిందని హేమలత తట్టుకోలేకపోయింది. దీంతో శ్రీనివాసరావు, హేమలత ఇద్దరూ కలిసి ఇటీవల బైకు పై వెళ్లి స్థానికంగా ఉండే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకొని హేమలత, శ్రీనివాస్ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒకేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news