అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ యువ‌కుడిని చైనా ఆర్మీ కిడ్నాప్

-

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కు చెందిన ఒక యువ‌కుడిని చైనా కు చెందిన ఆర్మీ కిడ్నాప్ చేసింది. ఈ విష‌యాన్ని అరుణాచ‌ల్ తూర్పు జిల్లా కి చెందిన ఎంపీ తాపిర్ గావ్ తెలిపారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలోని జిడో గ్రామానికి చెందిన ఎస్ హెచ్ మిరాం త‌రోన్ ను (17) చైనా దేశానికి చెందిన పీపుల్ లిబ‌రేష‌న్ ఆర్మీ కిడ్నాప్ చేసిన‌ట్టు ఎంపీ తాపిర్ గావ్ తెలిపారు. అయితే మిరాంతో త‌రోన్ ను తో పాటు అత‌ని స్నేహితుడిని కూడా చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని తెలిపారు.

అయితే త‌రోన్ ను స్నేహితుడు చైనా ఆర్మీ నుంచి త‌ప్పించుకున్నాడ‌ని తెలిపారు. కాగ త‌రోన్‌ను ను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసింద‌ని అత‌డు అధికారుల‌కు స‌మాచారం అందించాడ‌ని వివ‌రించారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం లోని షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతంలో త‌రోన్‌ను ను చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిన‌ట్టు అనుమానిస్తున్నామ‌ని ఎంపీ తాపిర్ గావ్ తెలిపారు. కాగ చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిన త‌రోన్‌ను ను విడుద‌ల చేసేందుకు భార‌త ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news